చెత్త నా.... ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని  ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. చెత్త , మరుగు దొడ్లు పై పన్ను వేసే వాడికి చెత్త నా కొడుకు అనక ఏం అంటారని ప్ర‌శ్నించారు. నేను అధికారం లోకి వస్తే పెంచుకుంటూ పోతానని జగన్ ఎన్నికల ముందే చెప్పాడ‌ని, పనికి మాలిన కొడుకులు పాలన చేస్తే ఇలానే ఉంటుంద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో , ఏం పీక్కుకుంటారో పీక్కోండి అంటు స‌వాల్ విసిరిరారు అయ్య‌న్న‌పాత్రుడు.
 

   కోడెల ద్వితీయ వర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించి మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మాట్లాడారు.. `నేను రాజకీయాలోకి వచ్చిన కొత్తలో కోడెలను చూసేందుకే విశాఖ నుంచి నరసరావుపేట వచ్చాను. కారులో వచ్చి కోడెల మీటింగ్ దూరం నుంచి విని వెళ్లాను. మరుగు దొడ్లు నిర్మాణంతో జాతీయ అవార్డు పొందారు. కోడెలను చూసి నా నియోజకవర్గం లో స్మశానాలను అభివృద్ధి చేశాను. 1983 నుంచి టిడిపి కి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివి. కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం` అని తెలిపారు.


  ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు అయ్య‌న్న‌. ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు  అమ్ముతాడా అని ప్ర‌శ్నించారు. సన్న బియ్యం అంటే తెలియనోడు పౌర సరఫరాల మంత్రిగా ఉన్నాడ‌ని, బెట్టింగ్ రాయుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. హోం మంత్రి ని చూస్తే జాలేస్తుందని, లేని చట్టం తో ఉరి శిక్ష లు, జీవిత ఖైదు శిక్ష లు వేశానని హోం మంత్రి చెబుతుంది అని ఆరోపించారు. లేని దిశ చట్టం కోసం ఆ నా కొడుకు రాజమండ్రి లో దిశా స్టేషన్ ను ప్రారంభించాడ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. హోం మంత్రి కి సిగ్గు , లజ్జ ఉంటే తక్షణమే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.      


     కోడెల కూడా హోం మంత్రి చేసాడు. ఆయన్ను చూసి నేర్చుకోండి అని సూచించారు. జైలు లో చిప్ప కూడు తినే నా కొడుకును తెచ్చి సీఎం ను చేశామంటూ, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాడు, వాడబ్బ సొమ్ము తెచ్చి తీరుస్తాడా అని సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు అయ్య‌న్న పాత్రుడు. సినిమా వాళ్ళ  బ్లాక్ టికెట్ లు కూడా సీఎం అమ్ముతాడంటా అని, ఇంటిటికి తిరిగి మల్లెపూలు కూడా అమ్ముకోండి అని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: