డిసెంబర్ 21 న ఈ దరఖాస్తు దారులకు ఆస్తికాగితాలు అందించడం అని ఆయన పేర్కొన్నారు. 14,609 కోట్లు మొత్తాన్ని వన్ టైం సెటిల్ మెంట్ ద్వారా పరిష్కరం అని మంత్రి వివరించారు. నవరత్నాలు, పేదలందరికి ఇల్లు కార్యక్రమం కింద 31 లక్షలకు మించి ఇంటి స్థలాలు ఇచ్చాము అని అన్నారు. లక్ష 80 వేల రూపాయలు ఇంటి స్థలానికి కేటాయించారు దానికి అదనం గా పావలా వడ్డీకి మరో 35 వేలు అప్పు బాంక్ ల తో ఇప్పిచాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఆయన.
రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు కెబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగా వాట్లను కేటాయించనున్న ప్రభుత్వం... యూనిట్టుకు రూ. 2.49కు సరఫరా చేసేలా కెబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బికి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్డీసీకి బదలాయించడానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమ ను తొలగించేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అన్నారు.