ప్రకటన సమయంలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పూర్తిగా ఆ ప్రాంత వాసులకు కొత్త వారే. మరి కొంతమంది అయితే... అసలు రాజకీయాలకే కొత్త. కొంతమంది అయితే ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందే పార్టీలో చేరిన వారు కూడా. అయితే వీరంతా కూడా దాదాపు భారీ మెజారిటీతోనే విజయం సాధించారు. ఇందుకు ఏకైక కారణం వైఎస్ జగన్ మాత్రమే. ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాట, ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా వారి మెజారిటీ నామమాత్రమే. ఇంకా చెప్పాలంటే... నాలుగు అంకెల సంఖ్య కూడా దాటలేని పరిస్థితి. ఇక విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాల్లో అయితే... ఏకంగా అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోనే. పెద్ద జిల్లాల్లో కూడా టీడీపీ ఒకటి రెండు స్థానాలే గెలవగలిగింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత... ప్రభుత్వానికి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు కూడా. అయితే ఇప్పుడు టార్గెట్ 2024లో కూడా జగన్ 2019లో అనుసరించిన వ్యూహాన్నే మళ్లీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో దాదాపు వంద మందికి మళ్లీ అవకాశం కష్టమే. మరోసారి కేవలం తన ఫోటో మాత్రమే చూపించి... ఓటర్లను ఓట్లు వేయమని అడిగే అవకాశం ఉంది. అందుకో వంద నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రకటన సమయంలో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పూర్తిగా ఆ ప్రాంత వాసులకు కొత్త వారే. మరి కొంతమంది అయితే... అసలు రాజకీయాలకే కొత్త. కొంతమంది అయితే ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందే పార్టీలో చేరిన వారు కూడా. అయితే వీరంతా కూడా దాదాపు భారీ మెజారిటీతోనే విజయం సాధించారు. ఇందుకు ఏకైక కారణం వైఎస్ జగన్ మాత్రమే. ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాట, ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా వారి మెజారిటీ నామమాత్రమే. ఇంకా చెప్పాలంటే... నాలుగు అంకెల సంఖ్య కూడా దాటలేని పరిస్థితి. ఇక విజయనగరం, నెల్లూరు, కడప జిల్లాల్లో అయితే... ఏకంగా అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోనే. పెద్ద జిల్లాల్లో కూడా టీడీపీ ఒకటి రెండు స్థానాలే గెలవగలిగింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత... ప్రభుత్వానికి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలిపారు కూడా. అయితే ఇప్పుడు టార్గెట్ 2024లో కూడా జగన్ 2019లో అనుసరించిన వ్యూహాన్నే మళ్లీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో దాదాపు వంద మందికి మళ్లీ అవకాశం కష్టమే. మరోసారి కేవలం తన ఫోటో మాత్రమే చూపించి... ఓటర్లను ఓట్లు వేయమని అడిగే అవకాశం ఉంది. అందుకో వంద నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.