ఆర్థిక అసమానతలు మన దేశంలో పెద్ద ఛాలెంజ్గా ఉంది. అతి తక్కువగా కాశ్మీర్లో ఎక్కువగా ఢిల్లీలో ఆర్థిక అసమానతల మధ్య తేడాలు ఉన్నాయి. ఆదాయాల అసమానతలు దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున అంతరాలను సృష్టిస్తున్నాయి. వృద్ది రేటు పెరిగిందని ఆనందం వ్యక్తం చేస్తుంటాం. ఈ ఏడాది ప్రథమ ఆర్థిక త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ది పెరిగిందని చెబుతున్నారు. నిజానికి రెండు నెలల పాటు లాక్ డౌన్ ఉంది. ఈ సమయంలో బేస్ -24 శాతం ఉంది. దీంతో బేస్ తక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక వృద్ది రేటు పెరిగిందని అనిపిస్తుంది. ఐఎంఎఫ్ చీఫ్ గీతాగోపినాథ్ ప్రకారం ఇది కేవలం మ్యాథమేటికల్ గ్రోత్ మాత్రమే.
వృద్ది అంటే జాతీయాదాయంలో వృద్ది దీంట్లో పేదలు, ధనవంతులు అందరూ వస్తారు. ముఖేష్ అంబానీ, ముష్టివాడి ఆదాయాన్ని సగటు చేస్తే దేశ తలసరి ఆదాయం వస్తుంది. కానీ దీని వల్ల పేదవాళ్ల ఆర్థిక పరిస్తితి పెరిగిందని చెప్పడానికి లేదు. దేశంలో ఉన్న ప్రజలందరికీ కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఆర్తిక అసమానతలు తగ్గిపోతాయి. ఆర్థిక అసమానతలు తొలగాలంటే ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు.