సాహితీ గ్రూపు ఛైర్మన్, రియల్ ఎస్టేట్ అధిపతి అయిన భూధాటి లక్ష్మీనారాయణను కూడా పాలక మండలి సభ్యునిగా నియమించారు. ఇక ముంబయికి చెందిన క్యాపరీ గ్లోబల్ అధినేత రాజేష్ శర్మ, కోల్కతాకు చెందిన పారిశ్రామిక వేత్త సౌరభ్లకు కూడా పాలకమండలిలో స్థానం దక్కింది. గత పాలక మండలిలో సభ్యురాలిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బంధువులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కూడా మళ్లీ పాలక మండలిలో స్థానం లభించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కేతన్ దేశాయ్కు పదవి లభించింది. మెడికల్ కౌన్సిల్ వివాదంలో ఈయనపై కేసులు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు సతీమణి అల్లూరి మల్లీశ్వరికి, పాండిచ్చేరికి చెందిన ఎమ్మెల్యే జగన్ సన్నిహితుడు అయిన మల్లాది కృష్ణారావుకు పదవులు దక్కాయి. ఇక కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనువడు శశిధర్కు, కూడా పదవులు దక్కాయి.
తమిళనాడుకు చెందిన కన్నయ్య పై పలు కేసులు ఉన్నప్పటికీ ఆయనను ప్రత్యేక ఆహ్వానితునిగా పాలక మండలిలో నియమించారు. వీరు కాకుండా రాజకీయాలలో వివాదాల్లో చిక్కుకున్న అనేక మంది పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే పాలక మండలి నియామకంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఆధ్యాత్మిక సంస్థలు కూడా పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు, అనేక కేసులు ఉన్నవారిని నియమించడం ఏమిటన్న ఆందోళన శ్రీవారి భక్తుల్లో వ్యక్తమవుతోంది.