రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టకపోయినా జగన్ మోడీని ప్రగాఢంగా నమ్ముతున్నాడు. కేవలం కేసుల విషయమై ఆయన తలొగ్గారా లేదా మునుపటి పోరాట స్ఫూర్తి ఆయన కనబరచడం లేదా అన్నది అంతుపోలడం లేదు అంతు తేలడం లేదు కూడా! దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదు. పోనీ అప్పులయినా పుడుతున్నాయా అంటే అదీ లేదు. జీఎస్టీ బకాయిల చెల్లింపుపై కూడా అస్పష్టతే ఉంది. ఇంకేం కావాలి? ఇంకేం రావాలి?
సాయిరెడ్డి మొదలుకుని మిగతా ఎంపీలంతా మోడీ భజనలోనే ఉన్నారు. ఉన్నారు అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ వారు అడిగేది ఏమీ లేదు. కేవలం రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ పై ఫిర్యాదులు ఇవ్వడం తప్ప వీళ్లేం చేస్తున్నదీ లేదు. ఈ నేపథ్యంలో జగన్ రాష్ట్రాన్ని ఏ విధంగా పురోభివృద్ధి చేస్తాడ న్నది అంతుపట్టడం లేదు. ఒకవేళ ఆయన ముందుస్తు ఎన్నికలు అంటూ ఓ ముసలం బయలుదేరిస్తే ముందు నష్టపోయేది జ గనే!2023 నాటికి ఎన్నికల జపం ఒకటి తీసుకువస్తే రాష్ట్రంలో ఘోర పరాజయం తప్పదు.