ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కి ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘం చాలా అలెర్ట్ అవుతుంది. ఎన్నికలు నిర్వహించడం పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 19న నిర్వహించనున్న జడ్పి టిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, డిపిఓలు, జడ్పి సిఇఓలు తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ అధికారులతో మాట్లాడారు. ఈనెల 19న నిర్వహించే జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు మార్గదర్శకాలను ఇచ్చి జాగ్రత్తగా వ్యవహరించారు.  ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లు ఎస్పి లకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు ఎస్పిలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ కలెక్టర్లు కు స్పష్టం చైనా ఆయన కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్  స్పష్టం చేసారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జి గా పెట్టాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది అలాగే  పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు సహా పలువురు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap