టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసారని ఆరోపిస్తూ టీడీపీ కీలక నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేసారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేశారు అని ఆరోపణలు చేసారు. చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు ఆయన. ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డీ-ఇంతకింతా బదులు తీర్చుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ప్రజాస్వామ్యం మంటగలిసింది అని అచ్చెన్న ఆరోపణలు చేసారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణమైచర్య అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ఏపీని ఆఫ్ఘనిస్థాన్ గా మార్చేశారు అని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారు అన్నారు ఆయన. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా? అని ఈ సందర్భంగా నిలదీశారు.

ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేస్తారా? జోగి రమేష్ ఎమ్మెల్యేనా లేక గూండానా? అంటూ నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి , జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు గారి ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటి? అని ఆయన నిలదీశారు. దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేయడం అరాచక పాలనలోనే చూస్తున్నాం అన్నారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని ఆయన ఆరోపించారు. అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారు అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేసారు. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాం అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: