ఎందుకీ నిర్ణయం
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ధర్మానను అభిమానించే వారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో రెవెన్యూ పదవి నిర్వహించారు. కొన్ని వివాదాలు రాజశేఖర్ రెడ్డి కారణంగానే చిక్కుకున్నారు. కొన్ని తన ప్రమేయం లేకపోయినా అనుచరుల కారణంగా వివాదాలకు తావిచ్చేయి. ఇవే కాకుండా ట్రైమెక్స్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపాన గార ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం, అదే విధంగా కొడుకు చిన్ని నడిపే వర్జిన్ రాక్స్ కోసం కన్నె ధార కొండ తవ్వకానికి అనుమతులు తెచ్చుకోవడం, అవి ఈనాడు బట్టబయలు చేయడంతో పెను వివాదాలు రేగడం ఇవన్నీ ధర్మాన పరపతిని తగ్గించేయి. ప్రతిష్టను దిగజార్చాయి. ఈ కోవలో ఆయన చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యారు. దేశం పార్టీ హయాంలో తన సామాజిక వర్గానికే చెందిన గుండ లక్ష్మీ దేవి (వరుసకు చెల్లెలు) ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఆమెకు సంబంధించి పెద్దగా ఆరోపణలు చేయలేదు. అలానే అచ్చెన్నాయుడి పైకూడా పెద్దగా ఆరోపణలు చేయలేదు. (దీనికీ ఒకే సామాజికవర్గమే ప్రధాన కారణం) తన కోపం అంతా చంద్రబాబుపైనే చూపించారు. ఆ క్రమంలోనే వివాదాస్పదం అయినప్పటికీ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు టౌన్ హాల్ ను ఎంచుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. వైసీపీకి జిల్లా కేంద్రంలో పెద్ద దిక్కు అప్పట్లో ఆయనే!