దళిత,గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారికి నష్టం కలిగించిన ఏ1 దోషి సిఎం కేసీఆర్ అని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. తాజాగా కాంగ్రెస్ ప్రచార కమిటీ తెలంగాణా ప్రభుత్వంపై చార్జ్ షీట్ విడుదల చేసింది. ప్రజాకోర్టులో నెంబర్ 1 దోషి కేసీఆర్ కు శిక్ష తప్పదు అని హెచ్చరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగంపైన ప్రమాణం చేసి తాను ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం నేరం అని అందుకే కేసీఆర్ నేరస్థుడు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఏడున్నర ఏళ్ళు అయ్యింది అని గుర్తు చేసారు.

2014 ఎన్నికల ముందు దళిత, గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు అని ఆరోపణలు చేసారు. 2014 నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చినా అవి అమలు చేయకుండా మోసం చేశారు అన్నారు. ఆయన హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు అని విమర్శలు చేసారు. కేసీఆర్ హామీలు నెరవేర్చినట్టు అయితే దళిత, గిరిజనులకు ఎంతో లాభం జరిగేది అని పేర్కొన్నారు.

నేరం.1
తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించి విస్మరించడం నేరం కాదా?

నేరం.2
భూమి లేని ప్రతీ దళిత కుటుంబానికి
3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం నేరం కాదా?

నేరం.3
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానన్న హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?

నేరం.4
నియామకాలే నినాధంగా సాగి రాష్ట్రాన్ని సాధించిన నిరుద్యోగులను నిండా ముంచడం నేరం కాదా?

నేరం.5
ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం నేరం కాదా?

నేరం.6
ఎస్టీ,మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?

నేరం.7
కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని నీరు గార్చడం నేరం కాదా?

నేరం.8
అమలుకు ఆమడ దూరంలో ఫీజు రీయంబర్స్మెంట్ నేరం కాదా?

నేరం.9
దళిత గిరిజనులపై హత్యలు,అత్యాచారాలు అడ్డుకోకపోవడం నేరం కాదా?

నేరం.10
ఆర్థిక సహకార సంస్థలు దళిత,గిరిజనులను ఆదుకోకపోవడం నేరం కాదా?

అంటూ చార్జ్ షీట్ విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts