అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. అసలు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. సో... ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ నుంచి మరో నేతను ఎంచుకోవాలి. పోనీ.. ఇక్కడ వైసీపీ బలంగా ఉందా అంటే అదీ లేదు. దీంతో ఎటొచ్చీ.. గతంలో ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు గెలుపు ఖాయమని అంటున్నారు పరిశీకులు. అదేవిధంగా.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం దక్కించుకున్న వాసుపల్లి గణేష్.. వైసీపీలోకి చేరిపోయారు.
ఈయనకే వైసీపీ టికెట్ ఇస్తుంది. ఈయనకు కూడా ఇక్కడ పాజిటివిటీ ఎక్కువగానే ఉందని అంటున్నారు. సో.. ఇక్కడ కూడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కేది కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు.. విశాఖ తూర్పు నుంచి విజయం సాధించిన టీడీపీ సీనియర్ నాయకుడు.. వెలగపూడి రామకృష్ణబాబుకు ఫిఫ్టీ ఫిఫ్టీ సంకేతాలు వస్తున్నాయి. తిరిగి ఆయన విజయం దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి విజయందక్కించుకున్న గణబాబుకు ఈ దఫా.. గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నా.. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారనేది ఆయనపై వస్తున్న ప్రధాన విమర్శ. ఇలా చూసుకుంటే.. వైసీపీ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు నియోజకవర్గాల్లో రెండు వైసీపీ, ఒకటి బీజేపీ.. ఒకటి మాత్రమే టీడీపీ దక్కించుకునే ఛాన్స్ ఉందని ప్రాథమికంగా విశ్లేషకులు భావిస్తుండడం గమనార్హం.