ఆఖరికి బెయిల్ రావడంతో కాస్త స్థిమిత పడ్డారు. ఇదే సమయంలో ఆయన గురించి జిల్లాలో ఎక్కువగా పనిచేసింది ఎంపీ రామూనే. బెయిల్ విషయమే కాదు మిగతా పార్టీ విషయాలను చక్కదిద్దింది ఎంపీ రామూనే. సహజంగా సున్నిత మనస్తత్వం ఉన్న రాముపై వైసీపీ పెద్దగా ఆరోపణలు చేయదు కానీ అచ్చెన్న అంటేనే మండిపడుతుంది. ఈ దశలో అచ్చెన్న చాలా వెనక్కు తగ్గారు. ఎందుకొచ్చిన గొడవ అన్న విధంగా ఆయన ప్రవర్తనా శైలి కూడా ఉంటోంది. క్యాడర్ ను కూడా వెనక్కు తగ్గమనే చెప్పారు. అచ్చెన్న తగ్గినా జగన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. అచ్చెన్నను అదే పనిగా కార్నర్ చేసే రాజకీయ ప్రత్యర్థి దువ్వాడ శ్రీను (మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు) ను రంగంలోకి దింపి, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి శ్రీను తన దూకుడు పెంచారు. టీడీపీ క్యాడర్ ను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అండ తనకుందన్న ధీమాలో భాగంగా అచ్చెన్నపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో ఆయన తన సొంత క్యాడర్ ను దూరం చేసుకున్నారు.
రోజు రోజుకూ ఫిర్యాదులు పెరగడంతో పార్టీ అధిష్టానం కూడా రేపటి వేళ ఆయనకు మంత్రి వర్గంలో చోటిచ్చేందుకు ముఖం చాటే స్తోంది అని సమాచారం. ఇప్పుడు అచ్చెన్న ప్లేస్ లో అయ్యన్న వచ్చారు. నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. అసలు తానొక సీనియర్ పొలిటీషియన్ అన్న మాటనే మరిచిపోయి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. ఇక అయ్యన్న అరెస్టు ఖాయ మని తెలుస్తోంది. అచ్చెన్న లానే అయ్యన్న కూడా త్వరలో కొన్ని ఇబ్బందులకు గురికాక తప్పదు. ఇప్పుడు అయ్యన్నపై మా ట్లాడేందుకు కరణం ధర్మశ్రీని రంగంలోకి దింపారు జగన్. ఆయనతో పాటు మరో వీరి విధేయుడు జోగి రమేశ్ కూడా ఉన్నారు. వీరి ద్దరితో పాటు రోజా కూడా తోడయ్యారు. ఇంత మంది మాట్లాడుతున్నా అయ్యన్న తన సహజ సిద్ధ ధోరణిలోనే వెళ్తున్నారు త ప్ప ఎక్కడా తగ్గడం లేదు.