ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు  చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు  వన్ సైడ్ గా ఉన్నటువంటి పాలిటిక్స్ అన్ని ప్రస్తుతం  చాలా మారిపోయాయి. ఓవైపు టిడిపి, మరోవైపు వైసిపి  నేతలు ఒకరిపై ఒకరు  విమర్శలు చేసుకుంటూ  దాడులకు దిగుతున్నారు. నువ్వా నేనా అన్న విధంగా ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధాలు కూడా చేసుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై చాలా ఘాటైన విమర్శలు చేశాడు.. ఏమిటా విమర్శలు..? ఏం జరిగింది..? విశాఖ జిల్లాలో ని విలేకర్ల సమావేశంలో  ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దుర్మార్గం గా మాట్లాడుతున్నారని అన్నారు. త్వరలోనే అయ్యన్నపాత్రుడు, అక్రమ వ్యాపారులు అన్ని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెడతాం.

రంగురాళ్లు వ్యాపారంలో వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లుకు ప్లాన్ కూడా తీసుకోలేదని తెలిపాడు. అయ్యన్న ను ఎక్కడ పెట్టగలమో అక్కడ పెడతామని ఆరోపించారు.
అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ , తాగుబోతు తాతజి  అంటూ ఘాటైన విమర్శలు చేశారు.  పెగ్గు, లెగ్గు లేకపోతే అయ్యన్నపాత్రుడు కి నిద్రపట్టదని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ కు క్షేమపణ చెప్పకపోతే  నర్శింపట్నం ప్రజలు తగిన బుద్దిచెబుతారని తెలియజేశారు. వైసీపీ నాయకులు, అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు కామెంట్స్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్ పై, మహిళ మంత్రి సుచేరిత పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. కుటుంబ సభ్యులను వాడుకొని వదిలేసిన వ్యక్తి అన్నయ్యపాత్రుడు అని తెలిపారు.


  మాకు మళ్ళీ రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తి జగన్ అని అన్నారు. గంజాయి వ్యాపారం చేసే వ్యక్తి అయ్యన్నపాత్రుడని అధికారులు పై అసభ్యకర పదజాలంతో మాట్లాడే వ్యక్తి అయ్యన్నపాత్రుడని తెలియజేశారు. బినామీ పేరులతో లేట్ రైట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు. నా భార్యకు డిసిసిబి చైర్మన్ పదవి ముఖ్యమంత్రి జగన్ ఇస్తే అయ్యన్న ఓర్వలేకపోతున్నారు. 24 గంటలలో ముఖ్యమంత్రి కి, హోంమంత్రి కి అయ్యన్నపాత్రుడు క్షేమపన చెప్పాలని హెచ్చరించాడు. లేదు అంటే అయ్యన్నపాత్రుడు ఇంటిని ముట్టడిస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: