రాష్ట్రం లో ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే అని హుజూరాబాద్ లో టీఆరెఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. టీఆరెఎస్ గెలిచినంత మాత్రాన కేంద్రం లో బిజెపి పడిపోతుందా అని ప్రశ్నించారు. బీజేపీ ఇక్కడ మజ్లిస్ కి భయపడం అని చెప్తోంది అని ఇక్కడ మజ్లిస్ కి ఎవరు భయపడటం లేదు అని వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటం గురించి మాట్లాడే బీజేపీ.. ఇంకా ఇక్కడి వాళ్లకు పెన్షన్ లు ఇవ్వటం లేదు అని వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటం లో అసలు బీజేపీ ఉందా అని ఆయన నిలదీశారు.
బీజేపీ కి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదు అని వ్యాఖ్యానించారు. ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్ట్ లు అని గుర్తు చేసారు. రాష్ట్రానికి వచ్చి కనీసం కేంద్రం ఇవ్వాల్సిన వాటి గురించి ఒక్క మాట మాట్లాడలేదు అన్నారు. గజ్వేల్ సభ పై కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంటుంది అని... షర్మిల పార్టీ కేసీఆర్ మీద తప్పా బీజేపీ, కాంగ్రెస్ మీద ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ లో పార్టీ ఎందుకు పెట్టిందో ఎవరికి తెలియదు అన్నారు ఆయన. షర్మిల, ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీ లకు తొత్తులు అని ఆరోపించారు.