ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ఐటి శాఖా మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ అభివృద్ధి చూస్తూ బండి సంజయ్ పాదయాత్ర అంటూ మొదలుపెట్టిన ఆయన... రేవంత్ కొత్త బిచ్చగాడు అని ఎద్దేవా చేసారు. రేవంత్ దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిది అని అన్నారు. మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్పా అంత సీన్ లేదు అన్నారు ఆయన. 50 కోట్లకు రేవంత్ పిసిసి చీఫ్ పదవి కొనుక్కున్నారు అని వారి పార్టీ నేతలే చెప్తున్నారన్న మంత్రి... మీ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే రేవంత్ మరి అడ్డ గాడిద నా అంటూ నిలదీశారు.

రాష్ట్రం లో ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రమే అని హుజూరాబాద్ లో టీఆరెఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. టీఆరెఎస్ గెలిచినంత మాత్రాన కేంద్రం లో బిజెపి పడిపోతుందా అని ప్రశ్నించారు. బీజేపీ ఇక్కడ మజ్లిస్ కి భయపడం అని చెప్తోంది అని ఇక్కడ మజ్లిస్ కి ఎవరు భయపడటం లేదు అని వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటం గురించి మాట్లాడే బీజేపీ.. ఇంకా ఇక్కడి వాళ్లకు పెన్షన్ లు ఇవ్వటం లేదు అని వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటం లో అసలు బీజేపీ ఉందా అని ఆయన నిలదీశారు.

బీజేపీ కి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదు అని వ్యాఖ్యానించారు. ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్ట్ లు అని గుర్తు చేసారు. రాష్ట్రానికి వచ్చి కనీసం కేంద్రం ఇవ్వాల్సిన వాటి గురించి ఒక్క మాట మాట్లాడలేదు అన్నారు. గజ్వేల్ సభ పై కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంటుంది అని... షర్మిల పార్టీ కేసీఆర్ మీద తప్పా బీజేపీ, కాంగ్రెస్ మీద ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.  షర్మిల తెలంగాణ లో పార్టీ ఎందుకు పెట్టిందో ఎవరికి తెలియదు అన్నారు ఆయన. షర్మిల, ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీ లకు తొత్తులు అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr