గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము అని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. 2020 లో కరోనా కారణంగా నిమజ్జనాలు జరగలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి సారిగా పీవీ మార్గ్ లోకూడా  నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాము   అని ఆయన తెలిపారు. 2.5 లక్షలు గణేష్ విగ్రహాలను జీ హెచ్ ఏం సి ద్వారా అందించారు అని సీపీ వివరించారు. దీంతో చాలా విగ్రహాలు ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నారు  అని ఆయన పేర్కొన్నారు. 27 వేల మంది పోలీసు బలగాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేశాము అని ఆయన పేర్కొన్నారు.

రాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తో నిఘా కట్టుదిట్టం చేశాము  అని అన్నారు. సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాము అని మీడియాకు వివరించారు. అనుభవం ఉన్న పోలీస్ అధికారులను నగరంలో ఇంచార్జ్ లు గా నియమించాము అన్నారు ఆయన. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనం మొత్తం పర్యవేక్షణ కొనసాగుతుంది అని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. నగరంలో దాదాపు 8175 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని ఆయన వివరించారు.

నాలుగు అడుగులు లోపు ఉన్న విగ్రహాలు 45 లు పైగానే నిమజ్జనం జరగవచ్చు అని అంచనా వేస్తున్నాం  అన్నారు ఆయన. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, వాటర్ వర్క్స్, పోలీసులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశాము అని ఆయన పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా 55 స్టాస్టిక్ క్రైన్స్ ఏర్పాటు చేశాము అని వివరించారు.  50 అంబులెన్స్ లను కూడా నగరంలో అలెర్ట్ చేసి ఉంచాము  అని సీపీ పేర్కొన్నారు. సిపి కార్యాలయం లో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది  అని అన్నారు ఆయన. మహిళ భద్రత కోసం అడిషనల్ సిపి షికాగోయల్ నేతృత్వం లో షీ టీమ్స్ ను ఏర్పాటు చేశాము అని మీడియాకు వివరించారు. ఖైరతాబాద్ గణేష్ 2.5 కిలో మీటర్ల పొడవునా శోభాయాత్ర కొనసాగునుంది అని క్రైన్ నెంబర్ 4 లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగుతుంది అని వివరించారు. గణేష్ నిమజ్జనం లో ఏదైనా ఫిర్యాదులు చేయాలంటే 9490598985, ల్యాండ్ లైన్ 040 27852482 నంబర్స్ కి చెయొచ్చు  అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: