నగరంలో  ఉన్నత విద్య మండలి ప్రణాళిక బోర్డు రెండవ సమావేశం జరిగింది. 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు అని మన రాష్ట్రంలోనే ఉంది అని ఆయన వివరించారు. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చాము అని ఆయన మీడియాకు వివరించారు. మౌలిక వసతులు, మానవవనరులు ఎక్స్చేంజి ప్లానింగ్ బోర్డు ద్వారా సాధ్యం అయింది అని ఆయన పేర్కొన్నారు.

విద్యలో నాణ్యత ప్రమాణాలు, ఉన్నత విద్య విస్త్రతం పై చర్చించాం అని మంత్రి అన్నారు. విద్యకు పేదరికం అడ్డుకారాదు అని ఆయన స్పష్టం చేసారు. విద్యను వ్యాపారం చేయకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి. సంస్కరణలకు శ్రీకారం చుట్టాము ఆ ఫలితాలు రెండేళ్లలో వస్తాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. విద్య, సంక్షేమంపై 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అని ఆయన పేర్కొన్నారు. పాత ప్రభుత్వం బకాయి పెట్టిన 2200 కోట్లు ఫీజ్ రీ ఎంబర్స్ మేంట్ మా ప్రభుత్వం చెల్లించింది అని అన్నారు.

ప్రయివేట్ విశ్వవిద్యాలయాలకు మేం వ్యతిరేకం కాదు అని ఆయన పేర్కొన్నారు. ప్రయివేట్ యూనివర్సిటీలపై  ఆచితూచి అడుగులు వేస్తున్నాం అని ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడితే అనుమతిస్తాం అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. 2500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చామని ఆయన తెలిపారు. బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేసారు. యూనివర్సిటీలో అధ్యాపకుల ఖాళీలను పూర్తి చేస్తాము అన్నారు ఆయన. స్టూడెంట్, టీచర్ రేషియోకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయని ఆదిమూలపు సురేశ్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: