ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ విషయంలో చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కొన్ని విషయాల్లో అవినీతిని బయటకు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఫైబర్ నెట్ అవినీతి విషయంలో ఒక అరెస్ట్ కూడా జరిగింది. కేంద్ర సర్వీసుల అధికారి ఒకరిని ఈ కేసుకి సంబంధించి ఏపీ సిఐడీ అధికారులు అరెస్ట్ చేసారు. ఆయన విషయంలో గత వారం రోజుల నుంచి విచారణ జరుగుతుంది. ఇక కాసేపటి క్రితం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ...

ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతుంది అని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగింది అని ఆయన తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారు అని స్పష్టం చేసారు. టేరా సాఫ్ట్ కు కాంట్రాక్ట్ లు ఇచ్చే ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ మంత్రి వర్గం ఏం చేసింది అని ఆయన నిలదీశారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా...!? అని ఆయన నిలదీశారు. సమగ్ర దర్యాప్తు తర్వాత బాధ్యులైన అందరు బయటకు వస్తారు అని స్పష్టం చేసారు.

వారిలో ఐ.ఏ.ఎస్.లు ఉండవచ్చు అని అన్నారు. ఏపీ ఎస్.ఎఫ్.ఎల్.సేవలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం అన్నారు. సామర్ధ్యం పెంచడం ద్వారా వినియోగ దారులకు మెరుగైన సేవలు అందిస్తాం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రెండు కోట్ల 80లక్షల రూపాయలతో విశాఖలోని ఫైబర్ నెట్ నెట్ వర్క్ విస్తృతం అవుతుంది అన్నారు ఆయన. ట్రిపుల్ ప్లే నెట్వర్క్ బాక్స్ లు త్వరలోనే వినియోగదారులకు చేరుస్తాం అని మీడియాకు వివరించారు. రెండు లక్షల కనెక్షన్లు తక్షణమే పెంచాలని ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. 4800గ్రామాలకు నెట్ వర్క్ విస్తరించాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: