తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, మూడెకరాలు, డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదు అని ఆరోపించారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను 3 లక్షల ఎకరాలు లాక్కున్నారు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత దళిత, గిరిజన లకు జరుగుతున్న అన్యాయం పై పోరాటాలు చేశాం అని ఆయన గుర్తు చేసుకున్నారు. దళిత బస్తీలు , ఆదివాసీ గూడెలకు వెళ్లాం అన్నారు. సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురు చూస్తోంది అని ఆయన ఆరోపించారు.

తెలంగాణ లో జరుగుతున్న అవినీతి పై కేసీఆర్ కుటుంబం మీద విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా కు ఆధారాలతో ఫిర్యాదు చేద్దామని అపాయింట్ మెంట్ కోరిన.. సమయం ఇవ్వలేదు అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షాకు బండి సంజయ్, అరవింద్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ తప్పుడు చరిత్రను మాట్లాడుతోంది అన్నారు ఆయన. రాంజీగోండు, కాశిం రిజ్వికి మధ్య వంద సంవత్సరాల తేడా ఉంది అని ఆయన పేర్కొన్నారు.

అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రకటనలో గోండు బిడ్డ సోయం బాబురావు ఫోటో పెట్టలేదు అని మండిపడ్డారు. మై హోమ్ రామేశ్వర్ రావు, రాజ్ పుష్పా సంస్థలకు తెలంగాణ భూములు అడ్డంగా కట్టబెట్టారు కేసీఆర్ అని దానిపై ఇప్పటికే సిబిఐ డైరెక్టర్ కు కోకాపేట భూములపై ఫిర్యాదు చేశాం అన్నారు. అదే హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను ఆహ్వానం పేరుతో.. ఈనెల  16న ఢిల్లీ లో చిన్న జీయర్ స్వామి, మై హోమ్ రామేశ్వర్ రావు కలిశారు అని ఆయన విమర్శించారు. డ్రగ్స్ తో తనకేమీ సంబంధం అని కేటీఆర్ అంటున్నడు.. ఈడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

కోర్టు లో ఎక్సైజ్ శాఖ అఫిడవిట్ వేసింది.. కేసు మూసేయమని .. ఎందుకు భయపడుతుంది అని ఆయన వ్యాఖ్యాలు చేసారు. ఈడీ ఈ రోజు రానా , రకుల్ ప్రీత్ సింగ్ ను పిలించింది.. ఆరోజు ఎక్సైజ్ శాఖ ఎందుకు విచారణ చేయలేదు అని నిలదీశారు. ఎక్సైజ్ విచారణను అడ్డుకున్నది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. డ్రగ్స్ విషయంలో కేంద్ర సంస్థలకు ఎందుకు సహకరించడం లేదు అని ఆయన నిలదీశారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు వస్తా.. వైట్ ఛాలెంజ్ లో భాగంగా వస్తా.. మీరు ఇద్దరూ అక్కడికి రండి అని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు నమూనాలు ఇద్దాం అని ఆయన సవాల్ చేసారు. వైట్ ఛాలెంజ్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్దాం అని సంచలన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: