గణేష్ శోభా యాత్ర, నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,  మహమూద్ అలీ పరిశీలించ నున్నారు.  19 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి మంత్రులతో పాటు DGP మహేందర్ రెడ్డి, హైదరాబాద్ CP అంజనీ కుమార్ ఏరియల్ వ్యూ నిర్వహించనున్నారు.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో ఈ రోజు మరోసారి సమీక్షించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

లక్షలాది మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ పరిసరాలలో 40 క్రేన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని... GH MC వ్యాప్తంగా 300 క్రేన్ లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.  ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహిం చేలా 19 వేల మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు చేసినట్లు... విద్యుత్ సరఫరా లో అంత రాయం కలగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచడం జరిగింద ని వివరించారు.

ట్యాంక్ బండ్ పరిధిలో 2600 LED లైట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని... హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ శోభాయాత్ర కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ట్రాఫిక్ డైవర్షన్ చేస్తు న్నందున వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాయంత్రం 4.00 గంటలకు మరోసారి ghmc పరిధిలో నిర్వహించే గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు.  ఇక గణేష్ శోభా యాత్ర, నిమజ్జనం నేపథ్యం లో తెలంగాణ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... అన్ని చర్యలు తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: