శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిపై కేసు నమోదు చేశామని పాతపట్నం పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఎస్సై అమిర్ అలీ సంబంధిత వివరాలను వెల్లడించారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ పాతపట్నంలో శుక్రవారం ర్యాలీ నిర్వహిం చడంపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. ఎంపీతో పాటు స్థానిక పాత పట్నం కార్యవర్గం, మాజీ ఎమ్మెల్యే కలమట రమణ తో సహా 77 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు లేని కే సులు, బహిరంగ సభల నిర్వహణకు లేని కేసులు తమ వరకూ వచ్చేటప్పటికీ ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. అధికార పక్షం ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని చెబుతున్నారు.
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిపై కేసు నమోదు చేశామని పాతపట్నం పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఎస్సై అమిర్ అలీ సంబంధిత వివరాలను వెల్లడించారు. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ పాతపట్నంలో శుక్రవారం ర్యాలీ నిర్వహిం చడంపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. ఎంపీతో పాటు స్థానిక పాత పట్నం కార్యవర్గం, మాజీ ఎమ్మెల్యే కలమట రమణ తో సహా 77 మందిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు లేని కే సులు, బహిరంగ సభల నిర్వహణకు లేని కేసులు తమ వరకూ వచ్చేటప్పటికీ ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. అధికార పక్షం ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని చెబుతున్నారు.