అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు ఫలితాలు వస్తున్నాయని.. దీంతో మేము బహిష్కరించాం అని మాట్లాడుతున్నారని టీడీపీ నాయకులపై ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో చంద్ర బాబు.. నారా లోకేష్‌  కాలికి బలపం కట్టుకుని తిరిగారని... ఫలితాలు ఏమైనా మారాయా..? అని ప్రశ్నించారు.  కుప్పం కూడా కుప్పకూలి పోయిందని..... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టిందని ఎద్దేవా చేశారు.  ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉందని.... జగన్మోహన్ రెడ్డి జన రంజక పాలన చేస్తున్నాడు కాబట్టే ఈ ఫలితాలు  వస్తున్నాయని తెలిపారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు.    

ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలని చంద్రబాబు కి లేదని.... ఆయన అధికారం లోకి వచ్చిందే కుట్రల వల్లనని ఆరోపించారు.   మమ్మల్ని 5 ఎళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారని.... ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.  మీకు కావాలంటే టీడీపీ మొత్తం రాజీనామా చేయండి...  మీ నియోజకవర్గాల్లో పోటీ చేసి తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. 

అంతకు ముందుకు మంత్రి అవంతి మాట్లాడుతూ... ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు వై.ఎస్.ఆర్ సిపి వైపు ఉన్నారని...  ఈ విజయాన్ని ఒక బాధ్యత గా తీసుకుంటున్నామన్నారు.  13 జిల్లాల్లో పూర్తిస్థాయిలో మరింత అభివృద్ధి చేస్తామని... ఏవో పీకుతారు అంటూ కామెంట్ చేసిన టీడీపీ నేతకు..ప్రజలు ఇచ్చిన ఈ పీకుడు చాలదా ? అని ప్రశ్నించారు.   చంద్రబాబు అసూయతో,కుట్రతో ఇన్నాళ్లు కోర్టులు ద్వారా ఆపారని... ప్రతి అభివృద్ధి పథకాన్ని కోర్టులు ద్వారా అడ్డుకోవాలని చూశారు..ఈరోజు ప్రజా తీర్పు ఎలా ఉందో  చూడాలని తెలిపారు. యుద్ధంలో గెలవడం వీరుడు లక్ష్యం, వెన్ను పోటు కాదని...ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటీ చేయాలని హితువు పలి కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: