2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు - కడప - కర్నూలు జడ్పీ పీఠాలను నాడు వైసీపీ గెలుచు కుంది. అయితే ఈ రోజు మాత్రం మొత్తం 13 జడ్పీ పీఠాలకు 13 వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇప్పటి వరకు వెల్లడి అయిన ఫలితాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా లో 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. ఇక రాజధాని ప్రాంతంలో ఉన్న మరో జిల్లా అయిన గుంటూరు లో 54 జెడ్పీటీసీ స్థానాల్లో 39 వైఎస్సార్సీపీ గెలిచింది.
మిగిలిన జిల్లాల్లో ప్రకాశంలో 55 స్థానాల్లో 55 గెలిచింది. నెల్లూరు జిల్లా చరిత్రలో వైసీపీ అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం జిల్లాలో ఉన్న 46 జడ్పీటీసీలను గెలుచు కుంది. విశాఖపట్టణం జిల్లాలో ఉన్న 39 స్థానాల్లో 32 వైఎస్సార్సీపీ గెలుచు కుంది. ఇక విజయనగరం లో 34 జెడ్పీటీసీ స్థానాల్లో 34 వైఎస్సార్సీపీ విజయం సాధించింది. శ్రీకాకుళంలో 38 జెడ్పీటీసీ స్థానాల్లో 15 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.
ఇక అనంతపురంలో 62 స్థానాల్లో 56 , చిత్తూరులో 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 , వైఎస్సార్ కడప లో 50 స్థానాల్లో 46 , కర్నూలులో 53లో 53 స్థానాలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. తూర్పు గోదావరిలో 61 జెడ్పీటీసీలకు మెజార్టీ వైసీపీ గెలిచింది. పశ్చిమ గోదావరిలో 48 జెడ్పీటీసీ స్థానాల్లో 30 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.