ఇక చంద్రబాబు తో పాటు ఆయన భార్య నారా భువనేశ్వరికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటరు పెద్ద షాక్ ఇచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న నిమ్మకూరులో సైతం వైసీపీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. అయినా స్థానిక ఎన్నికల్లో ఓటరు వారిని తిరస్కరించి వైసీపీకే పట్టం కట్టారు. ఇలా భార్య భర్తలు ఇద్దరికి స్థానిక తీర్పులో ఓటరు పెద్ద షాకే ఇచ్చారు.
ఇదిలా ఉంటే జగన్ సొంత జిల్లాలోని ఓ ఎంపీటీసీ ఫలితం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కమలాపూర్ మండలం దేవరాజుపల్లి ఎంపీటీసీని వైసీపీ గెలుచు కుంది. అయితే ఇక్కడే ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంది. ఈ ఎంపీటీసీ పరిధిలో మొత్తం 191 ఓట్లు ఉండగా వై సీపీ అభ్యర్థికి ఏకంగా 186 ఓట్లు వచ్చాయి. మిగిలిన ఐదు ఓట్లు ఇండిపెండెంట్ కు పడ్డాయి. ఇక్కడ టీడీపీ, బీజేపీలకు ఒక్క ఓటు కూడా రాలేదు. దీనిని బట్టి ఇక్కడ ఆ పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్థులు వారి ఓటు కూడా వారు వేసుకోలేదని స్పష్టమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెత్త ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఇక పూర్తి ఫలితాలు ఈ అర్థరాత్రికి వెలువడనున్నాయి.