ఇంకా చెప్పాలంటే........
డ్రగ్స్ కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు విషయమై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైట్ ఛాలెంజ్ పేరిట కేటీఆర్ ను ఉద్దేశిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అంతటా దుమారం రేపుతున్నాయి. ఇవాళ గన్ పార్క్ వద్ద టీపీసీసీ నిరసనలు తెలుపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ గంజాయి గల్చర్ పై పూర్తిగా దృష్టి పెట్టాలని, యువతను మత్తులో ముంచి ప్రశ్నించే గొంతులను దూరం చేయవద్దని హితవు చెప్పారు. ముఖ్యంగా రాత్రి పూట ఓ సారి అయినా సీఎం స్థాయి వ్యక్తులు తిరిగితే ఫలితం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సమాజాన్ని దారిలో పెట్టాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మరింత బాధ్యతతో ఉండాలని, ఇవాళ తాను విసిరిన ఛాలెంజ్ కు కేటీఆర్ వస్తే తానెంతో సంతోషించేవాడినని కూడా అన్నారు. ఇక ఈ వివాదంలోనే కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తూ కేటీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకన్నారని ప్రముఖ పత్రిక ద హిందూ సైతం ధ్రువీకరించింది. దీంతో టీపీసీసీ చీఫ్ కోర్టు ముఖంగా ఏం చెబుతారు..చెప్పినా వాటిని కోర్టు వినిపించుకుంటుందా లేదా రేవత్ రైట్ అని క్లిన్ చిట్ ఇస్తుందా? అన్నవి ప్రశ్నలు.