అలాగే నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని సవాల్ చేశారు. అంటే ఇప్పటికే పంచాయితీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ హవా కొనసాగింది. వన్ సైడ్గా అక్కడ వైసీపీ విజయం సాధించింది. అందుకే నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలవరని నాని మాట్లాడుతున్నారు. అయితే నానికి టిడిపి నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు టిడిపి నేతలు..నానీని బాగా టార్గెట్ చేస్తున్నారు.
వారు కూడా నానికి తగ్గట్టుగానే బూతులతో రెచ్చిపోతున్నారు. అసలు ఆ ఇద్దరు నేతలు నాని ఎప్పుడు మాట్లాడితే...ఆ వెంటనే మీడియాకొచ్చేసి హడావిడి చేసేస్తున్నారు. అలా నానిపై విరుచుకుపడుతున్న నాయకులు ఎవరో కాదు...ఒకరు టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మణిక్యాలరావు, మరొకరు టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు. ఈ ఇద్దరు నాయకులు నాని కోసమే సెపరేట్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. నాని ఎప్పుడు మాట్లాడతారా, ఆయనకు ఏవిధంగా కౌంటర్లు ఇవ్వాలా? అని చూస్తున్నారు.
మీడియా ముందుకు రావడం నానికి కౌంటర్లు ఇవ్వడం చేస్తున్నారు. అది కూడా బూతులతో చెలరేగి పోతున్నారు. మరి నాని మాత్రం వీరి విమర్శలకు ఎప్పుడు కౌంటర్లు ఇవ్వలేదు. నాని కేవలం చంద్రబాబునే విమర్శిస్తున్నారు. అంటే చంద్రబాబు కోసం నాని ఉన్నట్లు...నాని కోసం రాజు, మణిక్యాలరావులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరి ఈ రాజకీయం ఎంత వరకు నడుస్తుందో చూడాలి.