జగన్ సర్కార్ పై టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు.  ఒక్క ఛాన్స్ ఇమ్మని అధికారం దక్కించుకున్న వైసిపి రాష్ట్రం లో ఉన్న దోపిడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సహజ వనరుల దోపిడీ తో  ఇప్పటికీ 2.5 లక్షల కోట్లు నష్టం జరిగిందని..  గంగ వరం పోర్టు లో క్విడ్ ప్రో క్రో జరిగిందని.. 30 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారం నీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీల మోత మోగిస్తోందని మండిపడ్డారు  యరపతినేని శ్రీనివాసరావు. 

లిక్కర్ మాఫియా , సహజ వనరుల దోపిడీ తో ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పెట్రోల్ మరియు  డీజిల్ పై పక్క రాష్ట్రాల కన్న అధిక పన్నులు వేస్తున్నారని... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పరిస్థితులు చూసి పెట్టుబడులు పెట్టే వారు పారిపోతున్నారని చురకలు అంటించారు యరపతినేని శ్రీనివాసరావు...  జగన్ అడిన మూడు ముక్క లాట తో  రాజధాని లేని రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మిగిలి పోయిందని నిప్పులు చెరిగారు యరపతినేని శ్రీనివాసరావు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న సమస్యల ను ప్రజల నుండి ఏమర్చడానికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొడాలి నాని ఓ బూతుల మంత్రి అని... ఫైర్ అయ్యారు. చంద్రబాబు కాళ్ళు నాకి ఎమ్మెల్యే అయిన కొడాలి నాని సంగతి రాబోయే ఎన్నికల్లో గుడివాడ లోనే తేలుస్తామని సవాల్ విసిరారు టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు... ఓడిపోయిన తర్వాత కొడాలి నాని కి టిడిపి కార్యాలయం లో కార్లు తుడిచే ఉద్యోగం ఇప్పించే భాధ్యత తనదని ఎద్దేవా చేశారు. ఏపీ హక్కులను కాడుకునెందుకు మరో స్వాతంత్ర్య ఉద్యమ తరహా పోరాటం చేయాలని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: