ప్రస్తుతం సంస్థలు ఉద్యోగుల భద్రత కోసం ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ... టెక్కీలు మాత్రం ఆఫీసుకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఎక్కువ శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని తమ తమ కంపెనీలు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కూడా ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇంటి దగ్గరే ఉండి పని చేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. కాదని కంపెనీలు బలవంత పెడితే... ఆ సంస్థను వదిలి... మరో ఉద్యోగంలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కార్యాలయాల్లో కంటే కూడా... ఇంటి దగ్గర ఉండి పని చేయడమే తమకు సుఖంగా ఉందని దాదాపు 60 శాతం పైగా ఉద్యోగులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలు కూడా ఇదే బెటర్ అన్నట్లుగా భావిస్తున్నాయి. ఉద్యోగుల భద్రత అనేది ప్రస్తుతం చిన్న చిన్న సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలకు కూడా కొంత భారమే. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రతి ఉద్యోగికి రక్షణ కల్పించాలి. అందుకే దాదాపు ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే సంస్థలన్నీ కూడా మొగ్గు చూపుతున్నాయి.
ప్రస్తుతం సంస్థలు ఉద్యోగుల భద్రత కోసం ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ... టెక్కీలు మాత్రం ఆఫీసుకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఎక్కువ శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే విషయాన్ని తమ తమ కంపెనీలు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కూడా ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఇంటి దగ్గరే ఉండి పని చేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. కాదని కంపెనీలు బలవంత పెడితే... ఆ సంస్థను వదిలి... మరో ఉద్యోగంలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కార్యాలయాల్లో కంటే కూడా... ఇంటి దగ్గర ఉండి పని చేయడమే తమకు సుఖంగా ఉందని దాదాపు 60 శాతం పైగా ఉద్యోగులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రస్తుతం సంస్థలు కూడా ఇదే బెటర్ అన్నట్లుగా భావిస్తున్నాయి. ఉద్యోగుల భద్రత అనేది ప్రస్తుతం చిన్న చిన్న సంస్థలతో పాటు కార్పొరేట్ సంస్థలకు కూడా కొంత భారమే. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ప్రతి ఉద్యోగికి రక్షణ కల్పించాలి. అందుకే దాదాపు ఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే సంస్థలన్నీ కూడా మొగ్గు చూపుతున్నాయి.