కలెక్టర్ నివాస్ అధ్యక్షతన విఎంసి కౌన్సిల్ హాలులో దసరా కో ఆర్డినేషన్ సమావేశం నేడు జరిగింది. సమావేశానికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, సిపి బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జెసి మాధవి లత, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు సహా పలువురు హాజరు అయ్యారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరిస్తూ పలు సూచనలను మంత్రి వెలంపల్లి, కలెక్టర్ నివాస్ చేస్తున్నారు.

దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది అని స్పష్టం చేసారు. మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి అని ఉందని వివరించారు. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని వివరించారు. అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసారు. దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్ లైన్ స్లాట్ తప్పనిసరి అని స్పష్టం చేసారు.

ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రకటన చేసారు. కొండ కింద ఆన్ లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 7 వతేదీన శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దుర్గమ్మ... ర్శనం ఉంటుంది. 7 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఉందని పేర్కొన్నారు. దసరా లో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్న కో ఆర్డినేషన్ కమిటీ తీసుకుంటుంది అని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap