దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది అని స్పష్టం చేసారు. మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి అని ఉందని వివరించారు. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని వివరించారు. అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసారు. దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్ లైన్ స్లాట్ తప్పనిసరి అని స్పష్టం చేసారు.
ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రకటన చేసారు. కొండ కింద ఆన్ లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 7 వతేదీన శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దుర్గమ్మ... దర్శనం ఉంటుంది. 7 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఉందని పేర్కొన్నారు. దసరా లో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్న కో ఆర్డినేషన్ కమిటీ తీసుకుంటుంది అని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.