ఇక తర్వాత జరిగిన మున్సిపాలిటీల్లో 99 శాతం విజయాన్ని దక్కించుకోగా, కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసింది. మధ్యలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచింది. తాజాగా వెలువడిన ఎంపిటిసి, జెడ్పిసిటి ఎన్నికల ఫలితాల్లో దుమ్ములేపింది. దాదాపు 98 శాతం జెడ్పిటిసి స్థానాలని వైసీపీ దక్కించుకుంది. అలాగే 86 శాతం ఎంపిటిసి స్థానాలని కైవసం చేసుకుంది. అంటే వైసీపీని ప్రజలు ఎంతలా ఆదరిస్తున్నారో అర్ధమవుతుంది. అసలు ఏ మాత్రం ప్రతిపక్షాల వైపు ప్రజలు వెళ్ళడం లేదు.
ఈ విజయాలని బట్టి చూస్తే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి భారీగా సీట్లు ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీగా 151 సీట్లు ఇచ్చారు. టిడిపికి కేవలం 23, జనసేనకు ఒక సీటు ఇచ్చారు. అయితే స్థానిక పోరులో వైసీపీకి వన్సైడ్గా విజయం దక్కేలా చేశారు. అంటే నెక్స్ట్ 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తున్నారు. ఆఖరికి టిడిపి సిట్టింగ్ సీట్లలో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగింది.