ఇంకా చెప్పాలంటే.......... :
ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇవాళ బీఏసీ మీటింగ్ తరువాత అసెంబ్లీ విధివిధానాలు ఖరారు చేశాక ఢిల్లీ ఫ్లైట్ ఎక్కను న్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది రెండో సారి. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి పూజ చేశాక కొద్ది రోజులు గడిపి వచ్చారు. అప్పట్లో కొందరు మంత్రులను కూడా కలిసి వచ్చారు. ఆ సందర్భంగా ప్రధానితో భేటీ అయి కొన్ని విషయాలు కూడా చర్చించారు. అయితే ఆ భేటీ కృష్ణా జల వివాదాల గురించి ప్రధానితో చర్చించకపోవ డంతో వివాదాలకు తావిచ్చారు. ఈ సారి ఢిల్లీ పర్యటనలో ప్రధానితో కానీ ఇతర ముఖ్యులతో కానీ ఏం చర్చించనున్నారు అన్నది కీలకాంశం అయింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారని మాత్రమే తెలుస్తుంది. కృష్ణా జల వివాదాలపై ఏం మాట్లాడుతారు అదేవిధంగా కేంద్రం నిర్మాణం నిలుపుదల చేయాలన్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏం మా ట్లాడుతారు అన్నది ఇప్పుడు ఆసక్తిదాయకం. ఇవే కాకుండా మిగతావాటిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి! ప్రధాని కలిస్తే ఏమౌతుంది?