దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ఉత్తరాధిలో ఉల్లి పంట ఘోరంగా దెబ్బ తిన్నది. దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ సారి కర్నూలు జిల్లా ఉల్లికి గిరాకీ బాగుంటుందని రైతులు భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. దళారులు రంగ ప్రవేశం చేయడంతో... చివరికి కోత కూలీలు కూడా రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా ఉల్లి పంట సాగుకు కనీసం లక్ష రూపాయల నుంచి లక్షా 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది ఎకరా పంట సాగు చేస్తే కనీసం 250 బస్తాల ఉల్లిపాయలు దిగుబడి వచ్చింది. దాదాపు వంద క్వింటాళ్ల ఉల్లి. ఈ పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకెళ్తే... దళారులు ఇస్తున్న ధర చూసి రైతన్న బోరు మంటున్నారు. క్వింటా ఉల్లికి కేవలం 250 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. అది కూడా గ్రేడింగ్ విధానం ద్వారా మాత్రమే. మొత్తం వంద క్వింటాళ్లకు కేవలం 25 వేల రూపాయలు మాత్రమే చేతికి వచ్చింది. చివరికి రానూపోనూ దారి ఖర్చులు, రవాణా ఛార్జీలు కూడా దక్కడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ఉత్తరాధిలో ఉల్లి పంట ఘోరంగా దెబ్బ తిన్నది. దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ సారి కర్నూలు జిల్లా ఉల్లికి గిరాకీ బాగుంటుందని రైతులు భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. దళారులు రంగ ప్రవేశం చేయడంతో... చివరికి కోత కూలీలు కూడా రావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా ఉల్లి పంట సాగుకు కనీసం లక్ష రూపాయల నుంచి లక్షా 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది ఎకరా పంట సాగు చేస్తే కనీసం 250 బస్తాల ఉల్లిపాయలు దిగుబడి వచ్చింది. దాదాపు వంద క్వింటాళ్ల ఉల్లి. ఈ పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకెళ్తే... దళారులు ఇస్తున్న ధర చూసి రైతన్న బోరు మంటున్నారు. క్వింటా ఉల్లికి కేవలం 250 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. అది కూడా గ్రేడింగ్ విధానం ద్వారా మాత్రమే. మొత్తం వంద క్వింటాళ్లకు కేవలం 25 వేల రూపాయలు మాత్రమే చేతికి వచ్చింది. చివరికి రానూపోనూ దారి ఖర్చులు, రవాణా ఛార్జీలు కూడా దక్కడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.