రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్ చేసారు ఆయన. ముఖ్యమంత్రి కేసీఆర్ వరి పంట వేయొద్దని ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకోవాలి అని బండి ఆ లేఖలో డిమాండ్ చేసారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము 413. 50 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకోవాలి అన్ని బండి సంజయ్ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మ హత్యలు అన్ని తెరాస ప్రభుత్వ హత్యలే అని బండి అన్నారు.
రైతులకు ఉచితంగా ఎరువులు ఇచ్చి 2018 ఎన్నికలు సందర్భంగా తెరాస ఇచ్చిన హామీని నిలుపుకోవాలి అని బండి సంజయ్ కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, రైతులను దళారీల నుండి రక్షించాలి అని బండి సంజ సిఎం కేసీఆర్ ను విజ్ఞప్తి చేసారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలి అని ఆయన లేఖలో కోరారు. రైతులకు పట్టాదార్ పాసు బుక్కులను వెంటనే మంజూరి చెయ్యాలి అని బండి సంజయ్ కోరారు. రైతులకు అండగా ఉండి వారి తరఫున బిజెపి తెలంగాణ శాఖ పోరాటం చేస్తుంది అని బండి స్పష్టం చేసారు.