ప్రస్తుత అఫ్ఘానిస్థాన్ పరిణామాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు కొన్ని విషయాలపై కీలక దృష్టిసారించారు. ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు చైనా సహకరించడం.. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేయడం వంటి అంశాలపై మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అండ తోటే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేశారని మోడీ వ్యాఖ్యానించారు. ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ ఇప్పటికే ఎన్నోసార్లు దురాక్రమణకు ఇచ్చిందని.. దీనిని భారత్ సైన్యం సమగ్రంగా తిప్పికొట్టిన సందర్భాలను మోడీ ప్రస్తావించారు. అఫ్ఘాన్ పరిణామాలు, చైనా ఆసక్తి చూపిస్తున్న అంశాలు.. అమెరికా - భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని జో బైడెన్ వెల్లడించారు. ఐదు రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ప్రధానంగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ లతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఉగ్రవాదం, కరోనా మహమ్మారి, వాతావరణ పరిస్థితులపై మరింత కీలకంగా చర్చించాల్సిన సమయం వచ్చిందన్నారు ఇరు దేశాధినేతలు. ఇదే విషయంపై ఐక్య రాజ్య సమితిలో కూడా ప్రస్తావిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌస్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుత అఫ్ఘానిస్థాన్ పరిణామాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు కొన్ని విషయాలపై కీలక దృష్టిసారించారు. ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు చైనా సహకరించడం.. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం చేయడం వంటి అంశాలపై మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అండ తోటే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేశారని మోడీ వ్యాఖ్యానించారు. ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ ఇప్పటికే ఎన్నోసార్లు దురాక్రమణకు ఇచ్చిందని.. దీనిని భారత్ సైన్యం సమగ్రంగా తిప్పికొట్టిన సందర్భాలను మోడీ ప్రస్తావించారు. అఫ్ఘాన్ పరిణామాలు, చైనా ఆసక్తి చూపిస్తున్న అంశాలు.. అమెరికా - భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని జో బైడెన్ వెల్లడించారు. ఐదు రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ప్రధానంగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ లతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఉగ్రవాదం, కరోనా మహమ్మారి, వాతావరణ పరిస్థితులపై మరింత కీలకంగా చర్చించాల్సిన సమయం వచ్చిందన్నారు ఇరు దేశాధినేతలు. ఇదే విషయంపై ఐక్య రాజ్య సమితిలో కూడా ప్రస్తావిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో వైట్ హౌస్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.