సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... పట్టణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి అని అన్నారు మంత్రి. వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీ లలో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజా భాగస్వామ్యంతో మున్సిపాలిటీ లలోనీ అన్ని వార్డులలో ఆదివారం ప్రత్యేక డ్రైవ్ జరగాలని మంత్రి అన్నారు.

మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లు, కమీషనర్ లు, అధికారులు , పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలి అని హరీష్ రావు స్పష్టం చేసారు.  ఎంపీ, ఎమ్మెల్సీ అలాగే  ఎమ్మెల్యే లు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్ లో భాగస్వామ్య మై వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అని విజ్ఞప్తి చేసారు. సోమవారం నుంచి అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్ గా డ్రైవ్ చేపట్టాలి అని ఆయన కోరారు.

వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అని స్పష్టం చేసారు. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలి  అని అన్నారు ఆయన. దోమలు వృద్ధి చెందకుండా అన్ని మున్సిపాలిటీ లలో క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలి అని ఆదేశించారు. ఆంటీ లార్వా ఆపరేషన్ లు చేపట్టి దోమల వృద్ధిని నియంత్రించాలి అని ఆయన తెలిపారు. దోమల నివారణ, లార్వా వృద్ధిని అరికట్టేందుకు పట్టణాల లోని అన్ని చెరువులు, కుంటల్లో విస్తృతంగా ఆయిల్ బాల్స్ ను వేయాలి అని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts