ఇక రాయలసీమకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి కూడా వయసు పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట. అయితే ఆయన మాత్రం తన సతీమణి కోట్ల సుజాతమ్మను మాత్రం ఆలూరులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారట. ఇక ఛాన్స్ ఉంటే తన కుమారుడు రాఘవేందర్ రెడ్డిని కర్నూలు పార్లమెంటు బరిలోకి దింపాలని కూడా ఆయన చూస్తున్నారు.
ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన వచ్చే ఎన్నికలలోనూ పోటీ చేసి హ్యాట్రిక్ పరాభావాన్ని మూటకట్టుకోవడానికి సిద్ధంగా లేరట. ఇక అదే సీమలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం మాజీ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సయితం పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కుదిరితే పుట్టపర్తి, పెనుకొండ అసెంబ్లీల నుంచి తాను పోటీ చేయాలని ఆయన ప్లాన్లు వేసుకుంటున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో ? చూడాలి.