ఏపీ బీజేపీలో ముసలం ఇప్పుడు అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెప్పిస్తోందట.రాజకీయ సమీకరణాల నడుమ అధ్యక్షుడుగా ఏరికోరి మరి సోముని నియమిస్తే కొందరు సొంత పార్టీలోని నేతలు మాత్రం అధ్యక్షుడు ఆదేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారట.ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని బలోపేతం చేయాలని వడివడిగా అడుగులు సోము అడుగులు  వేస్తున్న వేళా అడ్డుకుంటున్న సొంత పార్టీ నేతలు ఎవ్వరు.వీరి విషయంలో సోము ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఏపీలో టీడీపీ,వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న కమలం పార్టీ రద సారదికి అడుగడుగునా సొంత పార్టీ నేతలు  ఆటంకాలు సృష్టిస్తున్నారట.ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను బీజేపీకి అనుకూలంగా మార్చుకునే క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు స్థాయిలో పార్టిలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఎపి బీజేపీలోని కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహార్తిస్తూన్నారట.క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంటే పార్టిలో రాష్ట్ర స్థాయి పదవులలో ఉన్న కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్నారని సోము భావిస్తున్నారట.అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత కమిటీల నియామకం,జిల్లా స్థాయిలో అధ్యక్షుల మార్పు,
అనుబంధ కమిటిలను నూతనంగా నియమించి పార్టీని ఘాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.ఇప్పటికే అనేక అంశాల్లో తాను తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరిస్తుండంటంతో పాటు పార్టీలో వర్గాలుగా విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని   సోము వీర్రాజూ భావిస్తున్నారట

మరోవైపు సోముకు వ్యతిరేకంగా పార్టీలోని కొందరు నేతలు తెరవెనుక చేస్తున్న ప్రయత్నాలపై సోము వీర్రాజు ద్రుష్టికి తీసుకొని వచ్చారట కొందరు నేతలు.అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలతో కమిటిల నియామకం పూర్తైయ్యాక వారి బాద్యతల నిర్వర్తించే క్రమంలో కొందరు సీనియర్లు పదే పదే  అడ్డుపడుతున్నారని కొందరు నేతలు అంటున్నారు.రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కీలక బాద్యతలు నిర్వర్తించే వారితో పాటు జిల్లాల స్థాయిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఇప్పటికె ఇదే అంశాన్ని అధ్యక్షుడు దృష్టికి తీసుకుని వెళ్ళారట కొందరు నేతలు.ఈ మధ్య కాలంలో కమిటీల నియామకం జరిగిన తరువాత బాధ్యతలతో సంబంధం లేకపోయినా తమకి సమాచారం ఇచ్చి పార్టీ కార్యాచరణ అమలు చేయాలని కొందరు నేతలు కింది స్థాయిలో నేతలపై ఒత్తిడి చేస్తున్నారని కొందరు బీజేపీలోని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.అధ్యక్షుడు ఆదేశాలతో  కార్యక్రమాలు అమలు చేస్తుంటే మధ్యలో తాము సీనియర్లమని మేము చెప్పింది చెయ్యాలని మాపై ఒత్తిడి చేయడం ఏంటని వరుసగా పిర్యాదులు చేస్తున్నారట.


ఇదిలా ఉంటె బీజేపీలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడుతో సంబంధం లేకుండా తెర వెనుక రాజకీయాలు చేయడం వెనుక  బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు.గత కొంత కాలంగా సోము నాయకత్వం వ్యతిరేకిస్తున్న నేతలంతా ఇప్పుడు వ్యూహం మార్చి కింది స్థాయిలో ఉన్న నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సోము వీర్రాజూ పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులు వేయడం. కొత్త కమిటీలు నియమించడం.పార్టీలో సీనియర్లకు పెద్ద పీట వేయడం లాంటి అంశాలు మింగుడు పడని నేతలు అంత ఇప్పుడు వ్యూహాత్మకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని అంటున్నారు.ఇదే అంశాన్ని ఇప్పటికే సోము వీర్రాజు అధిష్టానం దృష్టిలో ఉంచారని త్వరలోనే వారి భాద్యతల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు.రాష్ట్ర కార్యదర్శి,ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల స్థానంలో ఉన్న నేతలు ఇలా వ్యవహరించడంపై ఇటు సోము వీర్రాజు సైతం గుర్రుగా ఉన్నారట.చూడాలి తన నాయకత్వానికి, పార్టీలో నేతలకు,కార్యక్రమాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేతల విషయంలో సోము వీర్రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో

మరింత సమాచారం తెలుసుకోండి: