గులాబ్ తుఫాన్ దెబ్బకు ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా మారింది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాలేని పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇక ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సిఎం కేసీఆర్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పరిస్థితులపై సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ తో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసారు. గులాబీ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగా కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ ను సిఎం కోరారు.

పోలీస్, రెవిన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సిఎం స్పష్టం చేస్తూ అధికారులతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్ లో సిఎస్ తో పాటు  డీజీపీ మహేందర్ రెడ్డి,  రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు హాజరు అయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎస్... ఏ ఇబ్బంది ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.  జిల్లాలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచనలు చేసారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగ కుండా పటిష్టమైన చర్యలు చేపట్టరాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేసారు. హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లలో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్న  సిఎస్ ... ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts