ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు హద్దులు మీరి ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. అసలు వైసీపీ విధానాలకే విరుద్ధంగా వ్యవహరించారు. నువ్వేంత అంటే నువ్వెంత అంటూ విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న వైఎస్ జగన్... అసలు విషయం ఏమిటో తేల్చాలంటూ ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇంఛార్జ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్... ఇద్దరు నేతలను అర్జెంట్గా కలవాలని ఆర్డర్ వేశారు. మంగళవారం తాడేపల్లి వచ్చి... తనను కలవాలని ఆదేశించేశారు జగన్. గతంలో నుంచే ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పటికీ... వైవీ సుబ్బారెడ్డి వల్ల కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వివాదం రేగడం... పార్టీ పరువు పోయినట్లుగా జగన్ భావించారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే... పార్టీలో మరికొందరు నేతలు కూడా ఇదే తీరుగా వ్యవహరించే ప్రమాదం ఉందని... అలాంటి వారిని కట్టడి చేయాలంటే... గట్టి వార్నింగ్ తప్పనిసరి అనేది జగన్ ఆలోచన. సో.. ఈ ఎపిసోడ్లో జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది హాట్ టాపిక్గా మారింది.
ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు హద్దులు మీరి ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. అసలు వైసీపీ విధానాలకే విరుద్ధంగా వ్యవహరించారు. నువ్వేంత అంటే నువ్వెంత అంటూ విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న వైఎస్ జగన్... అసలు విషయం ఏమిటో తేల్చాలంటూ ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇంఛార్జ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్... ఇద్దరు నేతలను అర్జెంట్గా కలవాలని ఆర్డర్ వేశారు. మంగళవారం తాడేపల్లి వచ్చి... తనను కలవాలని ఆదేశించేశారు జగన్. గతంలో నుంచే ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పటికీ... వైవీ సుబ్బారెడ్డి వల్ల కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వివాదం రేగడం... పార్టీ పరువు పోయినట్లుగా జగన్ భావించారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే... పార్టీలో మరికొందరు నేతలు కూడా ఇదే తీరుగా వ్యవహరించే ప్రమాదం ఉందని... అలాంటి వారిని కట్టడి చేయాలంటే... గట్టి వార్నింగ్ తప్పనిసరి అనేది జగన్ ఆలోచన. సో.. ఈ ఎపిసోడ్లో జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది హాట్ టాపిక్గా మారింది.