తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై బీజేపీ శాసనసభ పక్షనేత రాజసింగ్ ఫైర్ అయ్యారు.  ఐటీ రంగం అభివృద్ధి పై అసెంబ్లీ సాక్షి గా కేటీఆర్ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు రాజసింగ్.  ఐటీ అభివృద్ధి పై ఎమ్మెల్యే లకు చెత్త పేపర్లు పంపిణీ చేశారని నిప్పులు చెరిగారు.  చేతకాకనే ..  కేసీఆర్, కేటీఆర్ లు కేంద్రాన్ని విమర్శించటం అలవాటుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజాం‌ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై తండ్రీ కొడుకులు చెరొక మాట మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.  

రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్రం తెరిపించటాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు.  మహిళలు, బాలికల భద్రతపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. డాటర్స్ దినోత్సవం రోజే.. అత్యాచారాలు జరగడం సిగ్గు చేటని విమర్శలు చేశారు  రాజసింగ్.  తెలంగాణ హోంమంత్రి రబ్బర్ స్టాంపుగా మారారని మండిపడ్డారు  రాజసింగ్.‌ హోంశాఖను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు  రాజసింగ్.  తెలంగాణలో క్రైం రేట్ విపరీతంగా పెరిగిందని.. బయటకు వెళ్ళిన మహిళలకు భద్రంగా ఇంటికి వస్తామన్న భరోసా కర వు వైందని ఆవేదన వ్యక్తం చేశారు  రాజసింగ్.

 ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్ లకు కేంద్రం నిధులు ఇచ్చిన ఏర్పాటు చేయడం లేదని ఫైర్ అయ్యారు  రాజసింగ్.  నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని ఓపెన్ చేయమని కేసీఆర్ అంటే ఓపెన్ చేస్తామని ktr అంటున్నారు... ఎవరు కరెక్ట్ అని చురకలు అంటించారు రాజసింగ్. ఆత్మ నిర్బర్ భారత్ కింద నిధులు వచ్చాయని పేర్కొన్నారు రాజసింగ్.  కానీ trs ఎమ్మెల్యే లు ఏ అంశం పై మాట్లాడిన కేంద్రం ని టార్గెట్ చేయాలని ట్రైనింగ్ ఇచ్చారని మండిపడ్డారు రాజసింగ్..  ఇంకో టీం డప్పులు కొట్టేందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు..  కేంద్ర ప్రభుత్వ నిధుల పై చర్చ పెట్టేందుకు మేము రెడీ అని చెప్పాము... బీజేపీ పెద్దలతో మాట్లాడక ప్లేస్, టైమ్ డిసైడ్ చేస్తామన్నారు రాజసింగ్.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp