అయితే, బీజేపీ పై ఎప్పుడు బుసలు కక్కె కేసీఆర్.. గత కొన్ని రోజులుగా ఎందుకో తెలియదు గానీ.. బీజేపీతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎలా ఉన్న కేంద్రంతో మాత్రం తెరవెనుక స్నేహం నడిపిస్తున్నాడనేది ప్రతిపక్షల వాదన.. ఇందుకు తగ్గట్టు కేసీఆర్ కేంద్ర బీజేపీ నాయకులను కలవడం.. తనకు కావాల్సిన పని చేయించుకోవడం కొనసాగుతూ వస్తోంది. అలాగే, కొన్ని బిల్లులకు కూడా పార్లమెంట్ బీజేపీకి సపోర్ట్ చేశారు టీఆర్ ఎస్ ఎంపీలు. అలాగే, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భేటీకీ, ప్రతిపక్షాలన్ని హాజరయ్యాయి. కానీ, టీఆర్ ఎస్ మాత్రం దూరం ఉండిపోయింది.
అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి. ఏడాది అయిన సందర్భంగా చట్టాలకు వ్యతిరేకంగా నిన్న చేపట్టిన భారత్ బంద్లో బీజేపీకి వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఇతర పార్టీలు పాల్గొన్నాయి. అలాగే పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా బంద్ కు సంఘీభావం తెలిపింది.