అయితే, గతంలోనై డబ్యూహెచ్ ఓ - చైనా సంయుక్తంగా కరోనా పుట్టుకపై విచారణ చేపట్టిన విషయం విధితమే. దీనికి సంబంధించిన నివేదికను మార్చిలో విడుదల చేశారు కూడా.. వూహాన్లోని ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందన్న ఆరోపణలను ఈ నివేదికలో తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో వుహాన్లోని ప్రయోగశాలలు, మార్కెట్లలో రెండో విడుత పరిశోధనలు చేపట్టాలని జులైలో ప్రతిపాదించారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథానోమ్. కానీ, దీన్ని చైనా తిరస్కరించిన సంగతి తెలిసిందే. యూఎస్లోని ఆర్మి మెడికల్ రీసెర్చ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ సహా ఇతర దేశాల్లోనూ పరిశోధనలు చేయాలని అప్పట్లో డబ్ల్యూహెచ్ ఓ ను డిమాండ్ చేశారు డ్రాగన్ కంట్రీ శాస్త్రవేత్తలు.
అయితే, డబ్ల్యూహెచ్ఓ కొత్త బృందాన్ని తమ దేశంలోకి అనుమతించాలా లేదా అన్న విషయంపై స్పష్టం చేసేందుకు నిరాకరించింది చైనా ప్రభుత్వం. ఈ తరహా పరిశోధనలను చైనా అంగీకరిస్తుంది, అనుమతిస్తుంది.. కానీ, ఈ పరిశోధన ముసుగులో రాజకీయ కుట్రలను వ్యతిరేకిస్తున్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఐరాస వేధికగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల చైనా పర్యటనపై ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు డబ్ల్యూహెచ్ఓ.