అక్రమాస్తుల కేసులో తనను అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలంటూ ఐపీఎస్ అధికారి గుర్ణీందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం... ప్రజా ధనం దోచుకున్న వారికి రక్షణ ఎందుకివ్వాలని ప్రశ్నించింది. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడిన అధికారులు ఎట్టి పరిస్థితుల్లో జైలుకు వెళ్లాల్సిందే అని కామెంట్ చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ప్రభుత్వంతో కుమ్మకైన పోలీసు ఉన్నతాధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై లేదన్నారు. అక్రమాస్తులు సంపాదిస్తే జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీజేఐ. తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ చేసిన వ్యాఖ్యలు పలువురు అధికారులను కలవరపెడుతున్నాయి ఇప్పుడు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక శాఖల్లో పని చేసిన పలువురు అధికారులు ఇప్పుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పటికే జైలుకు వెళ్లి.. బెయిల్ పై బయటకు వచ్చారు. అలాగే చంద్రబాబు సర్కార్లో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు కూడా ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. మరో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కూడా ప్రస్తుతం సీబీఐ కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. వీరంతా ఇప్పుడు సీజేఐ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారు. ఇక ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించి... ప్రజాధనం దుర్వినియోగం చేసేలా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు.
అక్రమాస్తుల కేసులో తనను అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలంటూ ఐపీఎస్ అధికారి గుర్ణీందర్ పాల్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం... ప్రజా ధనం దోచుకున్న వారికి రక్షణ ఎందుకివ్వాలని ప్రశ్నించింది. గత ప్రభుత్వాలతో సన్నిహితంగా మెలిగి అక్రమార్జనకు పాల్పడిన అధికారులు ఎట్టి పరిస్థితుల్లో జైలుకు వెళ్లాల్సిందే అని కామెంట్ చేశారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ప్రభుత్వంతో కుమ్మకైన పోలీసు ఉన్నతాధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై లేదన్నారు. అక్రమాస్తులు సంపాదిస్తే జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు సీజేఐ. తప్పు చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ చేసిన వ్యాఖ్యలు పలువురు అధికారులను కలవరపెడుతున్నాయి ఇప్పుడు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలక శాఖల్లో పని చేసిన పలువురు అధికారులు ఇప్పుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇప్పటికే జైలుకు వెళ్లి.. బెయిల్ పై బయటకు వచ్చారు. అలాగే చంద్రబాబు సర్కార్లో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఐబీ వెంకటేశ్వరరావు కూడా ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. మరో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కూడా ప్రస్తుతం సీబీఐ కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. వీరంతా ఇప్పుడు సీజేఐ వ్యాఖ్యలతో కలవరపడుతున్నారు. ఇక ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించి... ప్రజాధనం దుర్వినియోగం చేసేలా వ్యవహరించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు.