వచ్చే నెలలో మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందుతోంది. ఇందుకోసం ఆశావహులు అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా. మంత్రి వర్గంలో ప్రస్తుతం ఉన్న వారిలో 90 శాతం మందిని తప్పించాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించారు కూడా. కొత్తగా ఏర్పాటు చేసే టీమ్ను ఎలక్షన్ టీమ్ అని అంతా అనుకుంటున్నారు. దీంతో కొత్త కూర్పుపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పైరవీలు చేస్తుంటారు. కానీ జగన్ మాత్రం ఎంపీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముందుగా సమావేశం నిర్వహించి... వారి అభిప్రాయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనేది జగన్ భావన. సో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి మరి.
వచ్చే నెలలో మంత్రివర్గ కూర్పు ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందుతోంది. ఇందుకోసం ఆశావహులు అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా. మంత్రి వర్గంలో ప్రస్తుతం ఉన్న వారిలో 90 శాతం మందిని తప్పించాలని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ప్రకటించారు కూడా. కొత్తగా ఏర్పాటు చేసే టీమ్ను ఎలక్షన్ టీమ్ అని అంతా అనుకుంటున్నారు. దీంతో కొత్త కూర్పుపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పైరవీలు చేస్తుంటారు. కానీ జగన్ మాత్రం ఎంపీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముందుగా సమావేశం నిర్వహించి... వారి అభిప్రాయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులతో చర్చలు జరిగే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనేది జగన్ భావన. సో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి మరి.