ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నేడు మీడియాతో ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసారు. ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య సతీమణి దాసరి సుధా పోటీ చేస్తారు అని ఆయన స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక వచ్చిన వైసీపీ ప్రజల దగ్గరకు వెళ్తుంది అని అన్నారు. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసాం అని ఆయన వెల్లడించారు. సీఎం త్వరలో ఉప ఎన్నికపై ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేస్తారు అని పేర్కొన్నారు. టీడీపీ పోటీలో ఉన్నా మాకు వచ్చే నష్టం లేదు అని ఆయన తెలిపారు.

2019 తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో వైసీపీ విజయ పరంపర కొనసాగుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టపోయింది అని అన్నారు ఆయన. నంద్యాల ఉప ఎన్నికలాగా మేము ప్రజలను ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం వైసీపీని గెలుపొందెలా చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనీ  ఇప్పటికె అమలు చేసామని అన్నారు. ప్రజలను ప్రలోభాలు పెట్టాల్సిన  అవసరం లేదు అని సజ్జల స్పష్టం చేసారు.

బద్వేల్ ఉప ఎన్నిక  ఏమి  ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాదు అని అన్నారు. 2019ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీ బద్వేలు ఉప ఎన్నికలో వస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. పవన్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు ఫీల్ అవుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. పవన్ ఇండస్ట్రీకి గుదిబండలా తయారు అయ్యారని సినీ పెద్దలే అంటున్నారు అని ఎద్దేవా చేసారు. తన స్వార్థం కోసం ఇండస్ట్రీని రాజకీయాలలోకి పవన్ లాగారని సినీ పెద్దలు అంటున్నారు అని అన్నారు. ప్రభుత్వానికి లెక్కలు చూపడం లేదు,ప్రొడ్యూసర్లకు,ఎక్జిబిటర్లకు నష్టం వస్తుందని ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కోరడంతోనే  ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నాము అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: