2019 తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో వైసీపీ విజయ పరంపర కొనసాగుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టపోయింది అని అన్నారు ఆయన. నంద్యాల ఉప ఎన్నికలాగా మేము ప్రజలను ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమం వైసీపీని గెలుపొందెలా చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనీ ఇప్పటికె అమలు చేసామని అన్నారు. ప్రజలను ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం లేదు అని సజ్జల స్పష్టం చేసారు.
బద్వేల్ ఉప ఎన్నిక ఏమి ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాదు అని అన్నారు. 2019ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీ బద్వేలు ఉప ఎన్నికలో వస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు. పవన్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ పెద్దలు ఫీల్ అవుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. పవన్ ఇండస్ట్రీకి గుదిబండలా తయారు అయ్యారని సినీ పెద్దలే అంటున్నారు అని ఎద్దేవా చేసారు. తన స్వార్థం కోసం ఇండస్ట్రీని రాజకీయాలలోకి పవన్ లాగారని సినీ పెద్దలు అంటున్నారు అని అన్నారు. ప్రభుత్వానికి లెక్కలు చూపడం లేదు,ప్రొడ్యూసర్లకు,ఎక్జిబిటర్లకు నష్టం వస్తుందని ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కోరడంతోనే ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నాము అని స్పష్టం చేసారు.