కానీ టిడిపిలో ఉన్న దేవినేని ఉమా ఆధిపత్య పోరు వల్ల నాని బయటకొచ్చేశారు...జగన్ పెట్టిన వైసీపీలో చేరిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించేశారు. ఇప్పుడు మంత్రిగా దూసుకెళుతున్నారు. పైగా నాని వచ్చేశాక గుడివాడలో టిడిపి పుంజుకోలేకపోతుంది. అయితే టిడిపి పుంజుకోకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కమ్మ వర్గం...ఆ వర్గం వారు టిడిపికే ఎక్కువ మద్ధతు ఉంటారనే విషయం తెలిసిందే.
అయితే గుడివాడలో కమ్మ వర్గంలో చాలామంది నానికి సపోర్ట్ ఇస్తున్నారు. మిగిలిన కులాల మద్ధతు ఎలాగో నానికే ఉంది. కానీ కమ్మ వర్గం కూడా నాని వైపే ఉంది. అందుకే నానికి గుడివాడలో తిరుగులేకుండా పోయింది. అటు గన్నవరంలో అదే పరిస్తితి రిపీట్ అవుతుంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వంశీ...టిడిపి తరుపున గన్నవరం బరిలో విజయం సాధించారు.
కానీ అనూహ్యంగా వైసీపీ వైపుకు వచ్చేశారు. పార్టీ మారినా సరే గన్నవరంలో వంశీకి ఫాలోయింగ్ తగ్గలేదు. అయితే గన్నవరంలో ఉన్న కమ్మ వర్గం వంశీకి దూరమవుతుందని అంతా అనుకున్నారు. కాకపోతే అలా జరగలేదు. వంశీకే వారు ఇంకా మద్ధతుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఇప్పటికీ గన్నవరంలో టిడిపి పుంజుకోలేకపోతుంది. మొత్తానికైతే కమ్మ వర్గం సైలెంట్గా నాని-వంశీలకు సపోర్ట్ గా ఉందని చెప్పొచ్చు.