హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల విషయంలో మంత్రి హరీష్ రావు చాలా సీరియస్ గా పని చేస్తున్నారు. పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడపడానికి ఆయన పార్టీ కీలక నాయకులతో కలిసి పని చేస్తూ గ్రామ స్థాయి నాయకత్వాన్ని అన్ని విధాలుగా పటిష్టం చేస్తున్న సంగతి విదితమే. ఇక ఇప్పుడు విణవంక మండలం మామిడాల పల్లి లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ... ప్రచారం నిర్వహించారు. మామిడాల పల్లి లో 90 శాతం ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి పడితే గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్నికల తర్వాత కలెక్టర్ ను తీసుకువచ్చి దగ్గరుండి అభివృద్ధి పనులు చేయిస్తా అని ఆయన స్పష్టం చేసారు. మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి స్వగ్రామమైన మామిడాల పల్లి లో టిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. ముద్దసాని సేవలను గుర్తు చేసిన మంత్రి హరీష్ రావు... ముద్దసాని పేరు నిలబెట్టే విధంగా మామిడాల పల్లి లో కార్యక్రమాలు చేపడతాం అని స్పష్టం చేసారు. ముద్దసాని తనయుడు కశ్యప్ రెడ్డితో మాట్లాడి అభివృద్ధి పనులు చేయిస్తా అని ఆయన ఆయన హామీ ఇచ్చారు.

ముద్దసాని దామోదర్ రెడ్డి అంటే మాకు ఎంతో ప్రేమ గౌరవం ఆ గౌరవం కాపాడతా అని అన్నారు. తెలంగాణ రాక ముందు రైతులు ఎంతో గోస పడేవారని హరీష్ రావు పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి కాల్వలకు గండి కొడితేనే పొలాలకు నీళ్లు వచ్చేవి అని ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు అన్నారు హరీష్. రైతుల గురించి దామోదర్ రెడ్డి తపన పడ్డారు అని దామోదర్ రెడ్డి కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారుఅని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా నేడు వీణవంక మండలంలో గోదావరి జలాలు కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతున్నాయి అని తెలిపారు. ఇక 90 శాతం ఓట్లు టిఆర్ఎస్ పార్టీకే వేస్తామని మంత్రి హరీష్ రావుకు గ్రామ ప్రజలు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts