ఒకటి అమలు చేస్తే ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అమలు లేకపోతే విపక్షాలు అడ్డుపడ్డాయి అనే నెపంతో కూడా ప్రజలు అధికార పార్టీనే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి, కనీసం గెలిచిన తరువాత అది అమలు అవుతుందని వాళ్ళు ఆశపడవచ్చు. అయితే అది నిజంగా అమలు అవుతుందా లేదా అన్నది ఇప్పటి వరకు కేసీఆర్ పనితనం బట్టి చెప్పాలి లేదా నమ్మాలి. ఒకవేళ బీజేపీ ఈ పధకాన్ని అమలు కాకుండా చూసినప్పటికీ, కేసీఆర్ కు కలిసే వస్తుంది. ఎందుకంటే భారీగా ఖర్చుతో కూడుకున్న పధకానికి ఖర్చుపెట్టే పని తప్పుతుంది. అంటే ఆయనకు భారం తగ్గినట్టే కదా. ఎలా చూసుకున్నా కేసీఆర్ లేదా అధికార పార్టీకి మంచి జరిగే కార్యక్రమం, ఇలానే ఉంటాయి మరి కేసీఆర్ క్రీజులోకి వస్తే.
బీజేపీ గతంలో తెరాస నిద్రావస్థలో ఉన్న సమయంలో వచ్చిన ఉపఎన్నికలో ప్రచారంలో జాతీయనాయకులను దింపినందుకు గెలిచిందో లేక మరో కారణంతో కానీ మొత్తానికి ఒక సీటు అనూహ్యంగా సొంతం చేసుకుంది. అప్పటికి ఒక్కటే కదా అన్న స్వభావంలో ఉన్న తెరాస కు షాక్ ఇచ్చేలా బీజేపీ గొప్ప వ్యూహంతో హుజురాబాద్ సీటు ఖాళీ చేయించగలిగింది. అయితే ఈసారి కేసీఆర్ మేల్కొని, తానే స్వయంగా రంగంలోకి దిగటంతో అంతా మళ్ళీ అధికారపార్టీకి అనుకూలంగా మారిపోయింది.