ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు... ఇప్పుడు భౌతిక దాడులకు తెరలేపింది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారికి కొట్టారు. రాళ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. ఇక వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటిపై దాడి చూస్తే... బాబోయ్ అనేలా ఉంది. కార్లు ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలపై కూడా ఇదే పరిస్థితి. ఫర్నిచర్, సామాగ్రి పగుల గొట్టారు. అడ్డువచ్చిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇక బూతు మాటల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అన్నట్లుగా ఉంది. ఎంతో హుందాగా ఉండాల్సిన రాజకీయాలు కాస్తా.... సినిమాల్లో చెప్పినట్లుగా బురదలా మారిపోయాయి. మాటకు మాట సమాధానం కావాలి తప్ప... దాడి చేయటం ఎంత వరకు సమంజసం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో ఆ మాట కూడా అదుపులోనే ఉండాలని సూచిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని నడిరొడ్డుపై కాల్చి చంపాలంటూ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతున్నారు.
ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు... ఇప్పుడు భౌతిక దాడులకు తెరలేపింది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారికి కొట్టారు. రాళ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. ఇక వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటిపై దాడి చూస్తే... బాబోయ్ అనేలా ఉంది. కార్లు ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలపై కూడా ఇదే పరిస్థితి. ఫర్నిచర్, సామాగ్రి పగుల గొట్టారు. అడ్డువచ్చిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇక బూతు మాటల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అన్నట్లుగా ఉంది. ఎంతో హుందాగా ఉండాల్సిన రాజకీయాలు కాస్తా.... సినిమాల్లో చెప్పినట్లుగా బురదలా మారిపోయాయి. మాటకు మాట సమాధానం కావాలి తప్ప... దాడి చేయటం ఎంత వరకు సమంజసం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో ఆ మాట కూడా అదుపులోనే ఉండాలని సూచిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని నడిరొడ్డుపై కాల్చి చంపాలంటూ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతున్నారు.