అయితే ఈ బంద్ కు కొన్ని వర్గాల నుంచి సహాయ నిరాకరణ ఎదు రవుతోంది. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం తాము బంద్ కు సహకరించమని స్పష్టం చేసింది. వ్యక్తి గత దూషణలతో అ ప్రయోజనాత్మకంగా ఈ బంద్ కు పిలుపు ఇచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొంది. అందుకే ఈ బంద్ కు తాము సహకరింమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
ఇక గత రెండేళ్లు గా కరోనా వల్ల వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారని వాపోయింది. అంతే కాకుండా ఈ బంద్ వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేనందున తాము బంద్ కు సహకరించమని తెలిపింది. అయితే మరోవైపు టీడీపీ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి కక్కడ హౌస్ అరెస్టు లు చేస్తున్నారు. పోలీసులు ఈ రోజు తెల్లవారు ఝాము నుంచే రంగంలోకి దిగి టీడీపీ నేతలను ముందుగా అదుపు లోకి తీసుకో వడ మో లేదా.. హౌస్ అరెస్టులు చేయడమో చేస్తున్నారు.
ఇక పోలీసులు టీడీపీ నేతలకు వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందం గా తమ పనులు చేసుకోవచ్చని.. ప్రజల కార్యకలాపా లకు ఎవరు అయినా ఆటంకం కలిగిస్తే వారిని అరెస్టు చేస్తామని. వారిపై కేసులు పెడతామని వార్నింగ్ లు ఇస్తున్నారు.