రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం ఇప్పుడు హట్ టాపిక్గా మారింది. రాజకీయ దాడులతో రాష్ట్రంలో రాజకీయ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కింది. కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడి జరగడం... తెలుగుదేశం పార్టీకి కొంత మైలజ్ తీసుకువచ్చినట్లుగానే కనిపిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. రాజకీయ విమర్శలు సర్వ సాధారణం తప్ప... దాడులు జరగడం మాత్రం తొలిసారే. ఇలా దాడి చేయడంపై ప్రతిపక్షాలు అన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజకీయ విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ముందుగా నేతలను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు... ఇప్పుడు కార్యాలయాలపై దాడి చేయడం ఏమిటంటున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ప్రజల్లో సానుభూతి సాధించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం ఇప్పుడు హట్ టాపిక్గా మారింది. రాజకీయ దాడులతో రాష్ట్రంలో రాజకీయ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కింది. కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడి జరగడం... తెలుగుదేశం పార్టీకి కొంత మైలజ్ తీసుకువచ్చినట్లుగానే కనిపిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. రాజకీయ విమర్శలు సర్వ సాధారణం తప్ప... దాడులు జరగడం మాత్రం తొలిసారే. ఇలా దాడి చేయడంపై ప్రతిపక్షాలు అన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజకీయ విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ముందుగా నేతలను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు... ఇప్పుడు కార్యాలయాలపై దాడి చేయడం ఏమిటంటున్నారు. పార్టీ కార్యాలయంపై దాడులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ప్రజల్లో సానుభూతి సాధించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.